తప్పుడు ప్రచారంతో తప్పుదోవ పట్టించిన చైనా, తుర్కియే

ఈ దేశాల ఎక్స్‌ ఖాతాలను బ్లాక్‌ చేసిన భారత్‌

ప్రపంచ మీడియా, మేధోమదన సంస్థల్లోకి చొచ్చుకెళ్లిన చైనా

అందువల్లనే ఈ తప్పుడు కథనాల ప్రవాహం

ఎంత తప్పుడు ప్రచారం చేసినా అది తాత్కాలికమే

నిజం కచ్చితంగా బయటపడుతుంది

భారత్‌ ముందు చైనా ఆయుధాలు ఎందుకూ కొరగావన్న సత్యం వెల్లడైంది

ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్‌ వైపు

భారత్‌ నెత్తిన పాలుపోసిన పాకిస్తాన్‌

మన రక్షణ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం

ఆసియా, ఆఫ్రికా దేశాలు చైనాను నమ్మలేని పరిస్థితి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

భారత్‌ాపాకిస్తాన్‌ల మధ్య సంఘర్షణలు జరుగుతున్న వేళ, చైనా, తుర్కియేలు విపరీతంగా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించాయి. జరిగిన వాస్తవానికి పూర్తి భిన్నంగా వీటి ప్రచారం వున్న నేప థ్యంలో, వీటి ఓవర్‌ యాక్షన్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గ్లోబల్‌ టైమ్స్‌కు చెందిన ఎక్స్‌ ఖాతాను బ్లాక్‌ చేయడమేకాదు తుర్కియే బ్రాడ్‌కాస్ట్‌ టీఆర్‌టీపై నిషేధం విధించింది. పహల్గామ్‌ సంఘటన తర్వాత భారత్‌ చేపట్టిన చర్యల నేపథ్యంలో గ్లోబల్‌ టైమ్స్‌ పాక్‌కు అనుకూలంగా వార్తా కథనాలను రాసింది. అంతేకాకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను ప్రపంచ దేశాలు సమర్థిస్తుంటే, చైనా మీడియా వీటిపై తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. నిజానికి ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు అండగా చైనా, తుర్కియే, అజర్‌బైజాన్‌ లు నిలిచాయి. ఈ ఆపరేషన్‌కు ముందే ఎప్పటినుంచో చైనా తన రక్షణ ఉత్పత్తులను పాక్‌కు ఎగుమతి చేయగా, తుర్కియే ఆపరేషన్‌ సమయంలో కొన్ని వందల డ్రోన్లను పాకిస్తాన్‌కు అందజే సింది. అంతేకాకుండా వాటిని ఉపయోగించే విషయంలో శిక్షణ ఇచ్చేందుకు తన సైనికులను కూడా పంపినట్లు ఇప్పుడిప్పుడే స్పష్టమైన సమాచారం అందుతోంది. ముఖ్యంగా భారత్‌ చేసిన దాడుల్లో ఇద్దరు తుర్కియే సైనికులున్నారన్న సంగతి కూడా బయటపడిరది. తాజాగా చైనా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల పేర్లను మార్చేసింది. దీంతో భారత్‌ దీనిపై తీవ్ర అభ్యంత రం తెలపడమే కాదు, పేర్లు మార్చినంతమాత్రాన వాస్తవాలు మారిపోవు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ముమ్మాటికీ భారత్‌లో భాగమనేనని మన విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. 

కాల్పుల విరమణకోసం భారత్‌ కోరిందంటూ ప్రచారం

కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా పాశ్చాత్య మీడియా, ఇందుకు భారత్‌ భారత్‌ అభ్యర్థించిందని లేదా అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం తో ఒప్పుకున్నదంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టింది. ఈవిధంగా ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా భారత్‌ సాధించిన ఆధిపత్యాన్ని, మరింత బలపడిన నరేంద్రమోదీని బలహీన పరచడానికి ఒక పద్ధతి ప్రకారం మీడియా దుష్ప్రచారం చేసింది. ముఖ్యంగా చైనా ఆయుధసంపత్తి ఎంతోఆధునికమైనది మాత్రమే కాదు శత్రు దుర్భేద్యమంటూ ఊదరకొట్టేశాయి. నిజానికి పాక్‌ ఉపయోగించిన చైనా రక్షణ వ్యవస్థలు, చైనా విమానాలను భారత్‌ తుత్తినియలు చేసింది. జరిగిన ఈ అసలు విషయాన్ని కావాలనే తొక్కిపట్టడం ద్వారా, భారత్‌ సాయుధ సంపత్తి బలాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువ చేసి చూపడం ప్రధాన లక్ష్యంగా ఈ మీడియా ప్రచారం కొనసా గింది. ఇదే సమయంలో ఈ ఆపరేషన్‌లో భారత్‌ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నదని, పాకిస్తాన్‌ అ ప్రతిహతంగా విజయపథంలో పయనిస్తున్నదంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డా యి. పాక్‌కు చైనా సరఫరా చేసిన అత్యాధునిక ఆయుధ సంపత్తి మొత్తం తుక్కుగా మారిపోతున్న తరుణంలో, పాక్‌ విజయాన్ని, చైనా సామర్థ్యాన్ని ఆకాశానికెత్తేస్తూ అంతర్జాతీయ మీడియా రా స్తున్న కథనాల వెనుక అసలు కారణమేంటి?

తప్పుడు కథనాలు

నిజానికి అమెరికా ఒత్తిడి మేరకు పాక్‌ డీజీఎంఓ, మనదేశ డీజీఎంఓకు ఫోన్‌ చేసిన తర్వాత మాత్రమే కాల్పుల విరమణకు కేంద్రం అంగీకరించింది. కానీ పాశ్చాత్య మీడియా కథనాలు భారత్‌ ముందుగా కాల్పుల విమరణ కోరుకున్నదని పేర్కొన్నాయి. అంటే ఓటమి భయంతో భారత్‌ ముందుగానే కాల్పుల విరమణకు ముందుకొచ్చిందన్న రీతిలో వీటి రాతలు కొనసాగాయి. కేవ లం ‘పరస్పర అవగాహనతో’ తీసుకున్న చర్యమాత్రమేనని, కాల్పుల విమరణ కాదని భారత్‌ ఎంతగా చెప్పినా ఈ మీడియా పట్టించుకోలేదు. ఈవిధంగా భారత్‌ నియంత్రణ సామర్థ్యాన్ని, మొ త్తం ఆపరేషన్‌ నిర్వహించిన తీరును తక్కువచేసి చూపడానికే యత్నం జరిగింది. ముఖ్యంగా అ మెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ల ఒత్తిడికి నరేంద్రమోదీ లంగిపోయారని పాశ్చాత్యమీడియా ప్రచారం చేసింది. ఆవిధంగా అంతర్జాతీయంగా ఎంతో దృఢమైన నాయకుడిగా, విస్పష్టవైఖరితో కూడిన దౌత్యాన్ని నెరపుతారని నరేంద్రమోదీ పొందిన గుర్తింపును దెబ్బతీయాలన్న పన్నాగం ఈ రాతల వెనుక సుస్పష్టంగా కనిపించింది. నిజానికి ఈవిధంగా ఒక లక్ష్యంతో వ్యూహం ప్రకారం పనిచేసిన మీడియా కేవలం నరేంద్రమోదీపైన మాత్రమే కాదు డోనాల్డ్‌ ట్రంప్‌ సామర్థ్యంపై కూడా అనుమానాలు కలిగేలా వార్తలు వండివార్చింది. ముఖ్యంగా కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇది కనీసం రెండున్నర గంటలు కూడా అమల్లో లేదని, తర్వాత కాల్పులు మళ్లీ మొదలయ్యాయంటూ చెప్పడం ద్వారా, ట్రంప్‌ యంత్రాంగం భారత్‌`పాకిస్తాన్‌లను కాల్పుల విరమణను పాటించేలా చేయడంతో విఫలమైందని పేర్కొనడం ద్వారా, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పలుకుబడి క్షీణిస్తున్నదనడానికి దీన్ని ఉదాహరణగా చూపడానికి యత్నించింది.

పాశ్చాత్య మీడియాపై చైనా పలుకుబడి

ఈవిధమైన మీడియా రాతలను పరిశీలిస్తే పశ్చిమదేశాల మీడియా సంస్థలపై చైనా పలుకుబడి ఏవిధంగా వున్నదీ అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాల విశ్వవిద్యాలయాలు, పలుకుబడి కలిగిన మేధావులు, మీడియా సంస్థల్లో చైనా పలుకుబడి వేళ్లూనుకొని పోవడంతో, దీన్ని ప్రతి అంశంలోతనకు సానుకూలంగా మలచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇంతటి స్థాయిలో బలీయంగా విస్తరించడం వల్ల చైనా అంతర్జాతీయ దృక్కోణాలను తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవ డం లేదా మలచుకోవడం చేస్తున్నది. ఇప్పుడు మనదేశాన్ని వివిధ కోణాల్లో దెబ్బకొట్టడానికి ప్ర యత్నిస్తోంది. ముఖ్యంగా మన వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని బలహీనపరచడం, జాతీయ, అంతర్జాతీయంగా మోదీ నాయకత్వాన్ని అస్థిరం చేయడం, భౌగోళిక రాజకీయంగా ట్రంప్‌ పలుకుబడిని దెబ్బతీయడం వంటి ప్రక్రియల ద్వారా చైనా తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించుకోవాలని చూ స్తున్నది.

అంతర్లీన పరిణామాలు

కాల్పుల విరమణపై ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలకంటే ఎవ్వరికీ పట్టని అంతర్లీనంగా, ఆకస్మికంగా మనదేశంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించాలి. మొదటిది రిపబ్లికన్‌ టీవీకి చెందిన అర్నబ్‌ గోస్వామి, జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాలు ఒక్కసారిగా మౌనం వహించడం వెనుక కారణమేంటనేది పరిశీలిస్తే…పాకిస్తాన్‌లోకి డీఓయి విమానం ఎన్‌111ఎస్‌జెడ్‌ (ఎ03191) విమానం పాకిస్తాన్‌కు చేరుకోవడం. అంటే అణు రేడియోధార్మికతకు సంబంధించి ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడిరదన్నమాట. ఇక్కడ భారత్‌, పాకిస్తాన్‌ ప్రభుత్వాలు మౌనం పాటించాయి. పాకిస్తాన్‌లో అణువ్యవస్థలో లీకేజీ సమాచారాన్ని తన ఇంటెలిజన్స్‌ వర్గాలద్వారా తెలుసుకున్న చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. ముందుగా భారత్‌తో వున్న వాస్తవాధీనరేఖ దగ్గరకు తన సైనిక దళాలను పెద్దఎత్తున మోహరించడం ప్రారంభించింది. ఇదే సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా ఇదేవిధంగా వ్యవహరించింది. చైనా పరిస్థితి భారత్‌ను గందరగోళంలోకి నెట్టేసిందనే చెప్పాలి. 

కాల్పుల విరమణ తర్వాత నగ్రోటా, వైష్ణోదేవి సమీపంలో దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి.మందుగుండు సామగ్రి, సైనిక పరికరాలకు ఇవి చాలా కీలకం. డ్రోన్‌ దాడుల కారణంగా ఇక్కడ విస్ఫోటనాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఈ దాడులను చైనా`పాకిస్తాన్‌లుఉమ్మడిగా చేసినట్టుగా భావించాలి. కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా అప్పటివరకు పేలుళ్ల గురించి మాట్లాడుతూ, ఒక్కసారిగా సైలెంటయిపోయారు. బహుశా శ్రీనగర్‌కు సమీపంలో జరుగుతున్న దాడులను మన బలగాలు తక్షణమే అడ్డుకొని నిర్వీర్యం చేయడమే కాకుండా భద్రతా కారణాల రీత్యా ఏవిధమైన వ్యాఖ్యలు చేయవద్దని అబ్దుల్లాకు చెప్పివుండవచ్చు. ఇదే సమయంలోఅమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ మన ప్రధానికి ఫోన్‌ చేసి అణులీకేజీ, చైనా మోహరింపుల గురించి సమాచారం అందజేసివుండవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్‌ సార్వభౌమత్వానికి ఇబ్బంది ఏర్పడితే తాను స్వయంగా కలుగజేసుకుంటానని చైనా అంతకుముందు హెచ్చరించడం గమనా ర్హం. ఇదే సమయంలో హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు కూడా మౌనం పాటించడం వ్యూహాత్మకమే. ఎందుకంటే ప్రతిదాడులకు వ్యూహాలు పన్నుతున్నప్పుడు మాత్రమే ఇటువంటి మౌనం కనిపిస్తుంది. పాకిస్తాన్‌ కూడా ఆకస్మికంగా కాల్పుల విరమణను పాటిం చడానికి అమెరికా ఒత్తిడి, అంతర్గత అనిశ్చితి కారణం కావచ్చు. ఇదే సమయంలో చైనా దన్ను గా రావడంతో, పాకిస్తాన్‌ మళ్లీ రెచ్చిపోవడం మొదలైంది. అయితే చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్లయితే ఇది ప్రపంచయుద్ధానికి దారితీసివుండేదని కొందరు నిపుణుల అంచనా. చైనా` యుఎస్‌`రష్యాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో, భారత్‌పై సైనికచర్యతో పాటు, అమెరికా లక్ష్యాలపై కూడా దాడిచేసే పరిస్థితి ఏర్పడిరది. జె.డి.వాన్స్‌ ముఖ్యంగా సి.ఐ.ఎ. మరియు డి.ఐ.ఎ. హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీని అలర్డ్‌ చేసివుండవచ్చు. ఇదే సమయంలో పెద్దఎత్తున చైనా సైనికుల మోహరింపును అమెరికా ఉపగ్రహాలు గుర్తించినట్టు కూడా కొన్ని వార్తలు తెలియజేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అర్నబ్‌ గోస్వామి, ఒమర్‌ అబ్దు ల్లాతో పాటు అత్యున్నతస్థాయి మంత్రులను కూడా మౌనంగా వుండమని మన సైన్యం కోరివుండవచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఆపరేషన్‌ సింధూర్‌లో పాకిస్తాన్‌ కుప్పకూలిపోవడం, చైనాకు ఆగ్రహం కగిలించి తన సైన్యాలను మోహరించాలని భావించవచ్చేమో. 

మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్‌ సిందూర్‌ కొన్ని వాస్తవాలను ప్రపంచానికి వెల్లడిరచింది. మొదటిది భారత్‌ తిరుగులేని సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది. పాకిస్తాన్‌ సంప్రదాయిక రక్షణ సామర్థ్యం కుప్పకూలిపోగా, దాని అణ్వస్త్ర సామర్థ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. భారత్‌ నిరంతరాయంగా జరిపిన దాడులు, అసలు పాకిస్తాన్‌ బలహీనతలను బట్టబయలు చేశాయి. ముఖ్యంగా చైనా అందించిన అన్ని ఆయుధవ్యవస్థలను భారత్‌ తుత్తినియలు చేయడం పాకిస్తాన్‌ కు పెద్దదెబ్బ. చైనాను అడగలేదు…భారత్‌ను ఎదుర్కొనలేదు. ఇదీ దాని దుస్థితి. ఒకరకంగా చెప్పాలంటే పాక్‌ అణ్వస్త్ర సామర్థ్యాన్ని భారత్‌ నిర్వీర్యం చేసివుండవచ్చు. వ్యూహాత్మకంగా ఇప్పుడు పాక్‌ పూర్తిగా భారత్‌ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడిరది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!