నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న కోటపల్లి పోలీసులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో కోటపల్లి పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారితో కలిసి అంతరాష్ట్ర బ్రిడ్జి రాపనపల్లి వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా టాటా టియాగో కారులో తరలిస్తున్న1,45,800 రూపాయల విలువ గల 46.6 కిలోల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోటపల్లి ఎస్సై రాజేందర్,పోలీస్ సిబ్బంది పిల్లి శ్రీనివాస్,శ్యాంసుందర్, హోంగార్డ్స్ శ్యామ్,తిరుపతి రెడ్డిలను జైపూర్ ఎసిపి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,చెన్నూరు సిఐ దేవేందర్రావు,శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్,కోటపల్లి ఎస్సై రాజేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.