ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల జితేందర్
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మందకోడిగా సాగిన ఉపాధి పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముగియడంతో చేసే పనులు లేక ఇంట్లో ఉంటే పూట గడిచే పరిస్థితులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా కూలీలు ఉపాధిహామీ పనులను రోజుకు వేల మంది కూలీలు వినియోగించుకుంటున్నారు.మండలంలో ఉపాధి పనికి వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడంలో ఉపాధిహామీ సిబ్బంది విఫలమయ్యారని ప్రదేశాల్లో కూలికి రక్షణకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు కూలీలకు నీడ కోసం పట్టాలు, మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్టులు, అందుబాటులో ఉంచాలి. అయితే ఆ సౌకర్యాలు ఇప్పటివరకు అమలు అంతంత మాత్రమే జరుగుతున్నాయి. వేసవి తాపం నుంచి కూలీలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం త్వరితగతిన కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిచి, ప్రతి రెండు వారాలకు ఒకసారి పని జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించాలనీ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు చేశారు.