
బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
◆ పుస్తకాలను ఆవిష్కరించిన బీసీ నాయకులు .
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గము. తీన్మార్ మల్లన టీమ్,మరియు బీసీ నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన రాసిన ‘బీసీలకు పెనుముప్పు’ ‘ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల, ‘శాసనమండలిలో ప్రజా గొంతుక ‘అనే పుస్తకాలను శనివారం పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పుస్తకాలను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోట వల్ల విద్యా, ప్రభుత్వ రంగాల్లో బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని రిజర్వేషన్ వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాసిన పుస్తకంలో చాలా విషయాలు వాస్తవాలుగా ఉన్నాయని వారు రాసిన పుస్తకం ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఉన్నా అన్నారు.అన్ని రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు వారు తమ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జీ నర్సింహ, హనుమంత్,బీసీ నాయకులు డా. పెద్దగొల్ల నారాయణ, బీసీ తాలూకా కోర్ కమిటీ సభ్యులు కె. నర్సింలుముదిరాజ్ . ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, బీసీ నాయకురాలు జ్యోతి పండాల్, పి. అశోక్, పి.శేఖర్,తాలూకా బీసీ కోర్ కమిటీ సభ్యులు విశ్వనాథ్ యాదవ్, యువ జర్నలిస్ట్ శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.