
Everyone should plant trees.
‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలంలో వన మహోత్సవం కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ వరప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలని, మొక్కల పెంపకంతో మానవజాతి మనుగడ సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.