ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను.

District Education Officer M Rajender District Education Officer M Rajender

ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రెండవ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు & మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జంగేడు ఉపాధ్యాయుల సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు 551/600 సాధించిన విద్యార్థి కె. అజయ్ ను సన్మానించారు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్య ఆరోగ్యం న్యూట్రిషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలు విద్యాసంస్థలలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వాటి యొక్క ప్రాముఖ్యత క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ అంశాలపై శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను అందించాలని సూచించారు, బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న నూతన సాంకేతిక విద్య, క్రీడా, సాంస్కృతిక తదితర అంశాలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిందని తెలిపారు, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించాలని ప్రచారంతోపాటు బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, ప్రతి ఒక్కరూ స్వయం సహాయక బృందాలు,మెప్మా తదితర మహిళా సంఘాలు వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు, ప్రభుత్వ సూచించిన ప్రకారం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల హాజరు శాతం పెంచాలని ఆయన కోరారు, అనంతరం ఉపాధ్యాయులు చేపట్టిన ఇంటింటి బడి ఈడు పిల్లలను గుర్తించే కార్యక్రమంలో పాల్గొని బడి ఈడు పిల్లలు గ్రామస్తులతో చదువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు విద్యార్థులను చదువు వైపు మళ్ళించే విధంగా చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అజ్మీర దేవా, జిల్లా సామాజిక సమన్వయకర్త సామల రమేష్, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ప్రణాళిక సమన్వయకర్త దుప్పటి రాజగోపాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు ప్రధానోపాధ్యాయులు అశోక్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, విద్యావంతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!