వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ
వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తి కి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు, సీఈఐఆర్ ద్వారా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన వంశీ కి తన ఫోన్ అందించటం జరిగింది అని తెలిపారు.బాధితులు వేములవాడ రూరల్ పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.