పది దాటినా పంతులు లేడు

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కాకర్జల్ తండాలో ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా గురువారం రోజు 18 మంది విద్యార్థులు స్కూల్ కు హాజరయ్యారు 10 దాటిన టీచర్ సమయపాలన పాటించకపోవడంతో ఆ పాఠశాల విద్యార్థులు రోడ్లపై ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ వెళ్లి చూడగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు రోడు పై ఆడుకుంటున్నారు. ఆ పాఠశాల ఇన్చార్జి అయిన లింగంపల్లి హెచ్ఎం ను ఫోన్ ద్వారా విచారణ కోరగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు సెలవులో ఉన్నారని సమాధానం ఇచ్చారు. ఇట్టి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు సెలవు పై వెళ్తే వేరొక ఉపాధ్యాయులు ఎక్కడ వెళ్లారని నేటి ధాత్రి రిపోర్టర్ లింగంపల్లి హెచ్ఎం ను విచారణ కోరగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ఇట్టి విషయంపై గ్రామస్తులను విచారణ కోరగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించారని గ్రామస్తులు తెలిపారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!