కొప్పుల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ ఎన్నిక
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. శుక్రవారం గ్రామ ఇంచార్జులు చల్లా చక్రపాణి, పోతు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ఏరుకొండ శంకర్, ప్రధాన కార్యదర్శులు చాడ రాంరెడ్డి, పిట్టల నరేష్, ఉపాధ్యక్షుడు మామిడి రవి, సహాయ కార్యదర్శి గుండా ప్రవీణ్, కోశాధికారి అలువాల భాస్కర్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడు తూ తన ఎన్నికకు సహకరించి న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం కోసం కృషిచేస్తాన న్నారు.అలాగే గ్రామ అను బంధ కమిటీ ఎస్సీ, బీసీ, మైనా ర్టీ, మహిళా విభాగం కమిటీలు వేశారు ఈ కార్యక్ర మంలో కళ్లెపువంశీ, వంగాలతిరుపతి రెడ్డి, వేములపల్లి రవీందర్, సురేష్,కొమురయ్య, శాన బోయిన ఆగయ్య, గండి రాజు తదితరులు పాల్గొన్నారు.