బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..
జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాజు..
రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)
బాల్యవివాహాలను అరిక ట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్టెట్స్ ఫర్ చిల్డ్రన్స్ విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగరీ కైలాస్ ఆదేశానుసారం బాల్య వివాహాలపై జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రా ల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సం దర్భంగా రాజు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యా చారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రూ. లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆలయాలు, చర్చిలు మజీద్ లలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.
ప్రతిజ్ఞ చేస్తున్న భక్తులు, పూజారులు.
వంగరీ కైలాస్
విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ