వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సహ బహుమతులు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు..నగదు ప్రోత్సాహక బహుమతి.పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు వాసవి సేవా ట్రస్ట్ కల్వకుర్తి ఆద్వర్యంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5 వేలు, ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు 3 వేలు నగదు ను వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్ ట్రస్ట్ అధ్యక్షుడు దాచేపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి దొంతు శ్రీనివాసులు ప్రతిభ కనబరిచిన ఇంటర్మీడియట్ లో ప్రథమ బహుమతి బిల్లకంటి వర్షిత్ కు 5 వేలు,ద్వితీయ బహుమతి గంధం భరద్వాజ్ 3 వేలు, పదవతరగతి లో ఆకుతోట ప్రశాంత్ 5 వేలు, ద్వితీయ బహుమతి చంధన 3 వేలు నగదు ను విద్యార్థులకు శాలువా కప్పి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దేవాలయం చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక అందించడం అభినందనీయం, ఆదే విధంగా ప్రథమ ద్వితీయ తోపాటు తృతీయ ప్రోత్సాహకం అందించాలని, ఇంటర్మీడియట్, పదవతరగతి తోపాటు డిగ్రీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహక అందించాలని, సేవా ట్రస్ట్ సేవాకార్యక్రమాలు నిర్వహించడానికి నిధులు పెంచుకునేందకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, సేవా ట్రస్ట్ అధ్యక్షుడు దాచేపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి దొంతు శ్రీనివాసులు, కోశాధికారి గుబ్బ ప్రభాకర్, మహాసభ మండలం సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండూరు కృష్ణయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సంబు ముత్యాలు,సేవా ట్రస్ట్ సభ్యులు,ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు ప్రతిభ కనబరిచి ప్రోత్సాహం అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.