రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పర్శరాములు ఇటివల అనారోగ్యంతో మృతి చెందడంతో అనాధలైన ఇద్దరు చిన్నారుల జీవితం అగమ్యగోచరంగా మారి, నిలువ నీడలేని పరిస్థితిలో ఆపన్న హస్తం కోసం పిల్లలు ఎదురు చూస్తున్నా విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రుద్రారం ఎంపిటిసి గుఱ్ఱం దేవిక రాజశేఖర్ దాతల సహకారంతో సుమారు నలబై ఏడు వేల రూపాయలు సమకూర్చినారు. అట్టి రూపాయలను ఎంపిటసి గుఱ్ఱం దేవిక రాజశేఖర్ చేతుల మీదుగా చిన్నారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జవ్వాజి శేఖర్, గల్ఫ్ జేఏసీ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్, విద్యాకమిటీ చైర్మెన్ లక్ష్మణ్, తడగోండ రాజు, చిలుముల శ్రీను, నాగం మోహన్, నాగం కరుణాకర్, గౌడ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.