ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు గత మూడు నెలలుగా రావడం లేదని ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేసి పేస్కేల్ అమలు చేయాలి అని ఎం పి డి ఓ రాజి రెడ్డి కి లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. గత మూడు నెలలుగా వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని వారు అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలతో పాటు పేస్కేల్ ను అమలు చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టి ఏలు రవితేజ, మమత, సి ఓ లు అనిల్, శ్రీధర్, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.