విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి మండలంలోని మామిడి గట్టు గ్రామ శివారులో గత వారం పది రోజుల నుండి ఈదురు గాలులకు ఒక చెట్టు వేర్లతో సహా విద్యుత్ వైర్లపై పడింది..
అయితే దానిని సదరు విద్యుత్ అధికారులు మరియు చుట్టుపక్కల వారు చూసి చూడనట్లుగా వెళుతున్నారు.. ఆ విధంగా ఆ విద్యుత్ తీగలపై ఆ చెట్టు ఒరిగి ఉన్నా సరే విద్యుత్ అధికారులు ఆ లైన్ గుండానే విద్యుత్తును సరఫరా చేస్తున్నారు.. ఒకవేళ ఎక్కువ గాలి వచ్చి ఆ తీగలు తెగితే ఆ దారి గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులకు కచ్చితంగా ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది….
కావున
సదరు విద్యుత్ అధికారులు వెంటనే పై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు…