
Gowda Sangam
గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిదాత్రి;
ఓదెల మండలం లోని మడక గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా రంగు కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులుగా గట్టు మహేష్ గౌడ్, సభ్యులు నల్లగోని నరేందర్ గట్టు వీరస్వామి సిరిసేటి కిరణ్ దేశిని రమేష్ మేడగొని చిరంజీవి మొగిలి గాజర్ల శ్రీనివాస్ గట్టు సురేష్ లను గౌడ కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.