Arogya Lakshmi Committee Formed at Anganwadi Center
. అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య.
మొగుళ్ళపల్లి నేటి దాత్రి.
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోనిగుడిపహాడ్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొనిఆరోగ్యలక్ష్మి కమిటీ మెంబర్స్ ని ఎన్నుకొని మీటింగు నిర్వహించడం జరిగింది. చైర్మన్గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఆరోగ్య లక్ష్మి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యముఅంగన్వాడీ కేంద్రంలో జరిగే సేవలు గూర్చి మరియు ఆహార పదార్థాల పంపిణీ, అనుబంధ పోషకాహారం, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, 1000 రోజుల ప్రాముఖ్యత గురించి ఆరోగ్య సేవలు మరియు గర్భిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిశోర బాలికలకు చిక్కి ప్యాకెట్స్ , ఇమినైజేషన్ ,పూర్వ ప్రాథమిక విద్య ,విషయాల గూర్చి చర్చించుకోవడం జరిగింది. సర్పంచ్ , ఉప సర్పంచ్ గ్రామస్తులు,పెద్దలందరూ అంగన్వాడీ స్థలం కోసం చర్చించుకోవడం జరిగింది.ఈ కమిటీకి కన్వీనర్ గా అంగన్వాడి టీచర్ ఉంటారు.మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గర్భిణీలు ,బాలింతలు ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లల తల్లులు, మూడు నుండి ఆరు సంవత్సరముల పిల్లల తల్లులు ,కిశోర బాలికలు,, అంగన్వాడి టీచర్ పద్మ, వివో సభ్యులు ఆశా వర్కర్ , సునీత,ఆయా,తల్లులు పాల్గొన్నారు
