ఎన్నికల గురించి అవగాహన సదస్సు.

మాలహార్ రావు – నేటిధాత్రి
మండలంలోని మల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుగతం వాడుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని ఎలాంటి గొడవలు చేయకుండా శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైనా గొడవలు జరిగినట్లయితే పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ రంజిత్ రావు, కొయ్యూరు ఎస్సై నరేష్ తో పాటు సిబ్బంది, పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!