రేగొండ,నేటిధాత్రి:
అనారోగ్య సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రేపాక గ్రామంలో జరిగింది. ఎస్ఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రేపాక గ్రామానికి చెందిన గాజు బాగ్యక్క(65) తండ్రి కొమురయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.ఈ మేరకు మానసికంగా కృంగిపోయి పురుగుల మందు తాగగా మంగళవారం వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి మేనల్లుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.