వ్యక్తి అదృశ్యం
* సీతారాంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యంచేవెళ్ల,
ఇంట్లో నుంచి బయటకువెళ్లిన వ్యక్తి అదృష్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చించేటి బాలయ్య వయస్సు ( 73) అనే వ్యక్తి గతనెలా డిసెంబర్ 30న ఉదయం 6గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. 24గంటలు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు. దీంతో కనిపించకుండా పోయిన తన తండ్రి ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఆయన కుమారుడు చించేటి గణేష్ జనవరి 1న షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఆచూకీ తెలియకపోవటంతో మరోసారి ఈ నెల 8న చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. బాలయ్య ఆచూకీ తెలిసినవాళ్ళు తమకు సమాచారం తెలపాలని కుటుంబసభ్యులు కోరారు. మొబైల్ నెంబర్: 9000692257,9133445503.
