
Education department commissioner.
ముందస్తు మధ్యాహ్న భోజన కార్మికులను అరెస్టు
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిరసన, ధర్నా చేసుకునే హక్కు లేకుండా ప్రభుత్వాలు అణి చి వేత ధోరణి ఏదైతే ఉందో ప్రభుత్వాలు మానుకోవాలి.కార్మికులు ధర్నా చేసే హక్కులను కాలరాస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా లో మధ్యాహ్న భోజన కార్మికులను రాష్ట్ర సీఐటీయూ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వ చ్చేముందు మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్న కూడా ఆ దిశగా అమలు చేయడం లేదు. అదే సందర్భంలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, గౌరవేతనం, నెలల తరబడి రాకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా నలిగిపోతున్న కూడా ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించకపోవడం వల్ల ఈరోజు అనగా 6, తేదీన చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళుతున్నటువంటి కార్మికులను , నాయకులనుముందస్తు అరెస్టు చేయడాని తీవ్రంగా తప్పు పట్టడం జరుగుతుంది. జిల్లా సీఐటీయూ అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి గారిని, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులను వెంటనే విడుదల చేయాలి, అలాగే తక్షణమే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పూర్తిగా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా పత్రిక ముఖంగా మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ డిమాండ్ చేయడం జరుగుతుంది..