సాంబమూర్తి దేవాలయంలో దుర్గామాత ఉత్సవాలు

•కులమతాలకు అతీతంగా వేడుకలు
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని మొగుళ్లపల్లి పరిధిలోని శ్రీ సాంబమూర్తి దేవాలయం లో శివరామ కృష్ణ భజన మండలి మరియు వినాయక చవితి కమిటీ సభ్యుల వారిఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గ భవాని వేడుకలు గురువారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి.. అమ్మవారిని మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. . ఈసంవత్సరం విగ్రహ దాతగా బత్తిని రమేష్ అనిత పుణ్య దంపతులు విగ్రహాన్ని అందించడం జరిగింది నవరాత్రులు శ్రీ భైరవపట్ల వెంకటేశ్వర శర్మ అయ్యవారిచే అమ్మవారికి కుంకుమార్చన, అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు 9 రోజులు రోజుకో అలంకారంలో అమ్మవారు ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా పండగలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!