
MGNREGA Wage Delay Hits Laborers in Chityal
ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.
సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
చిట్యాల, నేటి ధాత్రి ,
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు నేటి వరకు కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఉపాధి ఉపాధి కూలీలు ఎండను సైతం లెక్కచేయకుండా అర్ధాకలితో పస్తులు ఉంటూ ఉపాధి పనులు చేస్తే ప్రభుత్వం కూలి డబ్బులు మంజూరు చేయకపోవడం సరైంది కాదు అని తెలుపుతున్నాం. సంబంధిత మండల ఈజిఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదని ఆరోపిస్తున్నాం. కూలీలు పస్తులు ఉండి పనులు చేస్తే కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుపుచున్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు రావలసిన కూలీ డబ్బులు మంజూరు చేసే వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.