రామకృష్ణాపూర్, మార్చ్ 02, నేటిధాత్రి:
క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో శనివారం శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినట్లు మునిసిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ, చైర్ పర్సన్ జంగం కళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వసంత్, కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, పనస రాజయ్య, కాంగ్రెస్ యూత్ నాయకులు బింగి శివకిరణ్, ఎర్రబెల్లి రాజేష్, మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.