BJP Protests Over Drinking Water Crisis in Siricilla
పన్నులు కట్టే ప్రజలకు త్రాగునీరు కరువు
– మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా
– పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నా
– మంచినీటి సమస్య తీర్చే వరకు బిజెపి పోరాటం ఆగదు
– బిజెపి పట్టణ అధ్యక్షులు
దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట
భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంపై నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రజల సమస్యలపై మున్సిపల్ పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ “సిరిసిల్లలో మంచినీటి సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోందని అన్నారు.

ఇది సహజ సమస్య కాదు… ఇది పూర్తిగా పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం” అన్నారు. “పన్నులు కట్టే ప్రజలకు కనీసంగా త్రాగునీరు ఇవ్వలేని మున్సిపాలిటీకి
పాలన చేసే నైతిక హక్కు లేదని మేము స్పష్టంగా చెబుతున్నామన్నారు.
“వెంటనే మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరాను అంతరాయం లేకుండా పునరుద్ధరించాలి,అలాగే పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా, సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. “ఇది రాజకీయ పోరాటం కాదు…
ఇది ప్రజల జీవన హక్కుల కోసం చేస్తున్న ఉద్యమం అని అన్నారు. “ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజలతో కలిసి మరింత బలమైన ఉద్యమాలకు తిగుతామన్నారు. “సిరిసిల్ల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ నిశ్శబ్దంగా కూర్చోదు – పోరాటం కొనసాగుతుంది” అని హెచ్చరించారు. మునిసిపల్ కమిషనర్ ప్రత్యక్ష హామీతో రెండు రోజుల్లో పూర్తి సమస్యలు తీర్చుతామని పక్క హామీతో నిరసన విరమించామన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యాన రాంప్రసాద్, మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, మోర శ్రీహరి, పల్లికొండ నరసయ్య, కాంభోజ శ్రీధర్, అంకారపు రాజు ,చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, కొడం రవి, సూరం వినయ్, సిద్ధి దేవరాజు, ఇంజపురి మురళి కృష్ణ, గాలి శ్రీనివాస్, ఊరగొండ రాజు, కొండ ప్రతాప్,రమేష్, సుంకరి బాలకిషన్, బండారి వెంకటేశ్వర్లు, జంప రాజు,దేవరాజు,వర్ణాల శేఖర్ బాబు, వెలిశాల అభి రామారావు, కనకయ్య, మహిళా నాయకులు వేముల వైశాలి, కమటం మంజుల, మల్లీశ్వరి, లత, వనిత, తదితరులు పాల్గొన్నారు.
