డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్యసేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూoరెడ్డి మరణం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
మంగళవారం కరీంనగర్ లోని భూంరెడ్డి పార్థివ దేహానికి చాడ వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
భూంరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
డాక్టర్ భూంరెడ్డి వరంగల్ జిల్లాలో పుట్టి వైద్య విద్యనభ్యసించి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ గా వైద్య సేవలు అందించడానికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, వైద్య వృత్తిలోకి వచ్చే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడని, వైద్య పరంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలలో పాలుపంచుకొని వైద్య వృత్తిపై, రోగులకు సేవలందించే విధానంపై అందరికీ వివరించేవాడని, వృతి పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని, ఐఎంఏను బలోపేతం చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పనిచేశారని,ఆయన ఎనబై ఏళ్ల వయస్సు దాటేంత వరకు కూడా వైద్య సేవలందించిన గొప్ప వైద్యులు భూoరెడ్డి అని అలాంటి డాక్టర్ మృతి చెందడం బాధాకరమని వెంకటరెడ్డి అన్నారు. మృతదేహానికి నివాళ్లర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బ్రామాండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నాయకులు చెంచల మురళి, తదితరులున్నారు.