పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావుని కలిసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బరిగెల రమేష్.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు వరంగల్ పార్లమెంట్ నుండి కాంగ్రేస్ పార్టీ తరుపున అవకాశం ఇప్పించుటకు రాష్ట్రoలోని అన్ని ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ సహకరించాలని తెలంగాణ మెడికల్ జాక్ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యమ నాయకులకు అవకాశం కల్పిస్తేనే తెలంగాణ పరిపూర్ణ అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తప్పకుండా తనకి తమ మద్దతు ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు.
గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షున్ని కలిసిన డాక్టర్ బరిగెల రమేష్
