
ఆయన ఆశయాలను కోన సాగించాలి.
కారేపల్లి నేటిధాత్రి
కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాశ్ బిఆర్ఎస్ నాయకులు అడ్డ గోడ ఐలయ్య ఎస్ కె గౌస్ ధ్దీన్ సోమందుల నాగరాజు రాములు ఎస్సి ఎస్టి బిసి మైనార్టీ నాయకులు పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని చిట్ట చివరి పేద కుటుంబం వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేరే విధంగా అధికారులు కృషి చేసినప్పుడే మహనీయుల ఆశయాలు సాధించినట్లు అవుతుందని అన్నారు.
విద్యనభ్యసించడం వల్ల ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పు వస్తుందనడానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నిదర్శనమని అన్నారు.బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంలో జగ్జీవన్ రామ్ విద్యనభ్యసించారని,
1936 సంవత్సరం నుండి 1986 వరకు దాదాపు 50 సంవత్సరాలు సీనియర్ పార్లమెంటేరియన్ గా పనిచేసిన ఏకైక వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. 1946లో జగ్జీవన్ రామ్ నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో ప్రజల మన్ననలు పొందారు భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ లో కార్మికమంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడుగా సామాజిక న్యాయాన్ని రాజ్యాంగంలో పొందుపరచబడిందని అన్నారు.
ఈ సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులు
తదితరులు పాల్గొన్నారు.