స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్. అంబేద్కర్ మండల నాయకులు శనిగరపు శ్రీనివాస్ తో కలసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు
మాట్లాడుతూ, స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన మహానీయుడని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని అన్నారు
అంబేద్కర్ దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తి ప్రదాత అని, దళితుల హక్కుల కోసం ఎంతో కృషి చేసి రాజ్యాంగంలో భద్రత కల్పించారని అన్నారు.
