కాటారం నేటి ధాత్రి
కాటారం మండలం దేవరంపల్లి గ్రామ పంచాయితీ లో పారిశుద్ధ పనులను జిల్లా పంచాయతీ అధికారి ఆశలత పరిశీలించారు. గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. బ్లీచింగ్ పౌడర్ , సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారి ఇళ్లల్లో ఉన్నటువంటి పాత కూలర్లలో పాత కుండలలో, ప్లాస్టిక్ వ్యర్ధాలలో ఉన్నటువంటి నీటిని పారబోసి ఎండ పెట్టుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మౌనిక, ఎంపీఓ ఉపేంద్రయ్య, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
పారిశుద్ధ పనులను పరిశీలించిన డిపిఓ ఆశలత
