బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

రామడుగు, నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ చోప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుంకే రవి శంకర్ కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రుద్రారం, కొక్కెరకుంట, వన్నారం, పందికుంటపల్లె, దేశరాజ్ పల్లె, కిష్టంపల్లి గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారం కార్యక్రమంలో బాగంగా రామడుగు మండల కేంద్రంలో సుంకె రవిశంకర్ సతీమని దీవెన పాల్గొని ఇంటింటికి తిరిగుతూ బోట్టు పెట్టి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి సుంకె రవిశంకర్ ని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో వెలిచాల మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, ఉప సర్పంచ్ పూదరి వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మండల యూత్ అధ్యక్షులు అరెపెల్లి ప్రశాంత్, సీనియర్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు చిమ్మల్ల మహేష్, సీనియర్ నాయకులు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నార్ల శ్రీనివాస్, మల్లెవేని మల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు మల్లెవేని మహేందర్, మల్లెవేని సాయికృష్ణ, నార్ల శ్రీకాంత్, ముదిరాజ్ కుల సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *