శాయంపేట నేటి ధాత్రి
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఓటును అమ్ముకోకు బానిసగా మారబోకు కరపత్రం బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మగ్గం సుమన్ ఆధ్వర్యంలో ప్రచారం కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. బహుజన సంక్షేమ సంఘం మగ్గం సుమన్ మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్ని వర్గాలలో సమానత్వం జీవించుటలో ఓటు అనేది కీలకం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య (ABSF) హనుమకొండ జిల్లా కన్వీనర్ నాగుల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.