ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు.

paddy paddy

ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రకృతి వైశాల్యాలు
రూపాయి కూడా ఆదుకోలేదు.

మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళాం తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది.

తడిసిన ధాన్యాలకు కొనుగోలు చేయండి మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.

మహాదేవపూర్- నేటిధాత్రి:

 

ప్రకృతి వైఫల్యానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, అనుకోకుండా ప్రకృతి వైఫల్యాలకు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం చేయడానికి ఖండించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో నాయకులు మాట్లాడుతూ,గురువారం అర్ధరాత్రి రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలోని పిఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రంలో వడ్లు తడవడం జరిగిందన్న విషయం వాస్తవమే , కానీ ప్రకృతి సంభవించిన వైఫల్యానికి అమాయక రైతులు నష్టపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులకు భరోసా కలిగించడం జరుగుతుందని అన్నారు. పేద రైతులకు అష్టపోకుండా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తక్షణమే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు తరలించి కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించడం కూడా జరిగిందని అన్నారు. పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో 176 రైతుల వడ్లు అందగా వాటిలో 63 రైతుల వడ్లు ఎక్కువ శాతం తడవడం జరిగిందని, ప్రతి ఒక్క రైతుకు నష్టం కలగకుండా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడంతోపాటు, రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని తరలించడం జరిగిందని, నేటికీ కూడా వడ్లను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కానీ కాంగ్రెస్ బిజెపి, రాజకీయం చేస్తుందని, కొనుగోలు కేంద్రం వద్ద వచ్చి ప్రభుత్వం వైఫల్యం, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పై బురదజల్లే విధంగా వ్యవహరించడం సమంజశం కాదని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మార్లు ప్రకృతి వైఫల్యంతో పత్తి ,మిర్చి,వరి, రైతులు పంటలు కోల్పోయిన దాఖలాలు ఉన్నాయని కానీ, ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి అన్నారు. నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా తడిసిన వడ్లను కొనుగోలు ప్రక్రియ చేపట్టి రైతులకు ఆదుకొనుటకు మంత్రి భరోసా కలిగించడం జరిగిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టం వాటిల్లకుండా ఇస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు రాణి భాయ్, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, ఎంపీటీసీ సుధాకర్, సమ్మయ్య, మాజీ చైర్మన్ రామన్ రావు, లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!