* అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
* గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవు..
* అత్యాశకు పోయి అన్ లైన్ పెట్టుబడులు పెట్టొద్దు..
* రామయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్..
రామాయంపేట ఏప్రిల్ 9 నేటి ధాత్రి (మెదక్).
యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్ గేమ్ యాప్ కి అలవాటు పడి అప్పు లపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రని, అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ యాప్లోగేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ప్రజలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అవగాహన లేక అత్యాశకు పోయి ఆన్ లైన్ నందు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ప్రజలు మోసాల బారిన పడుతున్నారు.
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు
బెట్టింగ్ యాప్ లు చాలా ప్రమాదకరమైనవి. వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుంది. యాప్ నిర్వాహ కుల నుండి బెదిరింపులు వస్తాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపా దించవచ్చన్న భ్రమలో యువత.విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి బానిసలుగా మారి అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లు ఆయా యాప్ నిర్వహకుల సూచనల మేరకే ఆపరేట్ చేయబడుతాయని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుంది ఫేక్
లింక్స్ తో వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకొనే అవకాశం ఉన్నందున గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండా లన్నారు. ఈఅక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవ రిపైనా ఉపేక్షించేది లేదని ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి. ఇటువంటి కార్యకలాపా లపై వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జి ల్లాలో సోషల్ మీడియా ఇన్ఫ్ ఎన్సర్లు బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దని, ఆన్లైన్ బెట్టింగ్. ఆన్లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్ తెలిపారు.