
"ACP Satish Babu Urges Caution Amid Heavy Rains"
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
పరకాల ఏసీపీ సతీష్ బాబు
పరకాల నేటిధాత్రి
గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నతరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు డివిజన్ ప్రజలను కోరారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పోల్స్,ట్రాన్స్ఫర్మర్స్ లను ఎవరు తాకరాధని,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లోనివారు అప్రమత్తంగా ఉండాలి,వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా వేరే చోట ఉండాలని కోరారు.చెరువులు నిండి ప్రమాదస్థాయిలో ఉన్నందున,చేపలు పట్టడానికి చెరువుల వద్దకు ఎవరు వెల్లవద్దని రోడ్లపై వరద వచ్చినపుడు వాహనధారులు అట్టి వాహనాలను రోడ్లపై దాటుటకు ప్రయత్నించకూడదని,అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకుడదని ఎటువంటి ఇబ్బందీ కలిగిన పోలీస్ వారికి డయల్100 ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.