
భద్రాచలం నేటి ధాత్రి
జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరానికి రెండు లక్షల రూపాయలు విరాళం అందినది.
భద్రాచలం వాస్తవ్యులు పద్మ క్లాత్ స్టోర్స్ గొండేల రత్నకుమారి w/o లేటు గోండెల వెంకటేశ్వరరావు పేరు మీదుగా వారి మనుమడు, కోడలు కలిసి
శ్రీ సాయిబాబా వారికి చేయించనున్న స్వర్ణ సింహాసనమునకు (బంగారు పూతతో ) రెండు లక్షల విరాళమును ఆలయ అధ్యక్షులు, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి కుంచాల రమేష్ లకు అందజేశారు. అనంతరం దాతలను శాలువాతో సత్కరించి బాబా వారి మేమెంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు మందరపు నాగరాజు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు