మల్లాపూర్ నేటి ధాత్రి
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గత కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో కోటిలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి గ్రామానికి చెందిన పలువురు మహిళలు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు కోటిలింగేశ్వర స్వామి ఆలయ ఏర్పాటుకు విరాళాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమారి రామగిరి వసంత మన కోటిలింగేశ్వర స్వామీ నూతన ఆలయనిర్మాణంలో భాగంగా ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ ద్వారా సేకరించిన నిధులను తన వంతు విరాళంగా 150000 రూపాయలు అందించారు గ్రామ అభివృద్ధి కమిటీ దేవాలయ కమిటి మొగిలిపేట గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికమిటీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
