రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.
27 వ సారి రక్తదానం రాజశేఖర్.
నర్సంపేట నేటిధాత్రి:
రక్తదానం చేయండి..ప్రాణదాతలు కండి అని ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పిలుపునిచ్చారు.శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పాల్గొని 27 వ సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా
హాస్పిటల్ ఆర్.యం.ఓ.డాక్టర్ గణేష్
అభినందించిన అనంతరం వారు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ హాస్పిటల్ లలో రక్త నిల్వలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో,ప్రతి ఒక్కరు రక్తదానం చేసి రక్త నిల్వలుపెంచి ప్రాణదాతలు కావాలన్నారు.18 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా
రక్తదానం చేయొచ్చని పేర్కొన్నారు.
రక్తదానం చేసిన కొద్దిరోజుల్లోనే మళ్ళీ రక్తం పునరుత్పత్తి అవుతుందన్నారు.
రక్తదానం చేసిన వారిలో నర్సింగ్ విద్యార్థులు,మెడికల్ షాప్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రవికాంత్ లు ఉన్నారు.ఈకార్యక్రమం లో బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నిషియన్ లు శ్రీనివాస్,రాజేశ్వరిభాయి,నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.