`28`90 నానోమీటర్ టెక్నాలజీలో స్వావలంబన దిశగా అడుగులు
`దిగుమతులపై ఇక ఆధారపడాల్సిన అవసరంలేదు
`దేశ అవసరాలతో పాటు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించే యత్నాలు
`వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్,నేటిధాత్రి:
సెమికండక్టర్ రంగంలో స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న భారత్ ఈ ఏడాదిలోగా ఈ లక్ష్యా న్ని సాధించనున్నది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయాన్ని తెలియజేశారు. సెమికండక్టర్ చిప్ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందిగా పరిగణించే 28`90 నానోమీటర్ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ తయారీ చిప్ ఈ ఏడాది చివరల్లో మార్కెట్లోకి రానుంది. మే 29న జరిగిన కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక వాణిజ్య సదస్సులో ఈ అద్భుత విషయాన్ని ప్రకటించారు. 2022లో భారత్ ఈ చిప్ తయారీ రంగంలోకి భారత్ ప్రవేశించింది. కేవలం మూడేళ్ల కాలంలోనే ఈ అద్భుతాన్ని సాధించడం విశేషం. ఈ ప్రకటనతో భారత్ అంతర్జాతీయ చిప్ మార్కెట్లో తన వంతు వాటాను సాధించేందుకు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు పడినట్లయింది. ముఖ్యంగా చిప్ తయారీలో టెక్నాలజీ నోడ్కు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్ వుంది. మొత్తం చిప్ మార్కెట్లో 60శాతం టెక్నాలజీ నోడ్ ఆక్రమిస్తోంది. ప్రస్తుతం భారత్ ఈ రంగంలో పట్టును సాధించేందుకు వ్యూహా త్మకంగా గట్టి ప్రయ్నతం చేయనుంది. ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు, రై ల్వే సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో టెక్నాలజీ నోడ్ చిప్లకు అత్యధిక డిమాండ్ వుంది. ప్రస్తుతం మనదేశంలో ఆరు ఫ్యాబ్రికేషన్ యూనిట్లు నిర్మాణంలో వున్నాయి. ఇదేసమయంలో దేశంలో రూ.76వేల కోట్లతో సెమికండక్టర్ ఎకోసిస్టమ్ రూపకల్పన జరుగుతోంది. దీన్ని సెమికండక్టర్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సెమికండక్టర్ చిప్ల దిగుమతిపై మనదేశం పూర్తిగా ఆధారపడాల్సి వస్తున్నది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తం గా చిప్తయారీ దెబ్బతిన్న ప్రభావం మనదేశంపై బలీయంగా పడినమాట వాస్తవం. ఈ నేపథ్యంలో చిప్లు ప్రతి రంగానికి అత్యంత అవసరమైన నేటి కాలంలో, వీటిపై పూర్తిగా దిగుమతులపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదని అప్పుడే భారత్ గుర్తించి, వీటి తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన కృషిని ప్రారంభించింది. ఆ ప్రయత్నాల ఫలితం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చి ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో తయారైన చిప్లు మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయనున్నాయి. దీంతో పాటు మనదేశం ప్రపంచ చిప్ మార్కెట్లో వాటా సంపాదించడం తో పాటు మరింత విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది.
వ్యూహాత్మక ప్రకటన
దేశంలో తొలి సెమికండక్టర్ చిప్ తయారీ ప్రకటన వెనుక ఎంతో జాగరూకత, వ్యూహాత్మకత ఇమిడి వున్నాయి. చిప్లను స్వదేశంలో తయారుచేయడం వల్ల మనకు దిగుమతుల భారం తగ్గ డంతో పాటు గ్లోబల్ మార్కెట్లో ప్రవేశించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో సాంకేతిక రంగంలో మన సార్వభౌమాధికారాన్ని సుస్థాపితం చేయడంతో పాటు ఆర్థికపరంగా ఇతరదేశాలతో మరింత పోటీ పడేస్థితికి ఎదగవచ్చు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ`2వ సదస్సులో మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేసిన ప్రకటనలోని సారాంశం ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్ వుండటంతో పాటు 60% డిమాండ్ వున్న టెక్నాలజీ నోడ్ మార్కెట్లోకి ప్రవేశించి సుస్థిరత సాధించడమే ప్రధాన లక్ష్యమన్నది స్పష్టం చేస్తున్నది. ఈరంగంలో మార్కెట్ గతిశీలతపై ఇప్పటికే మనదేశం ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయ సెమికండక్టర్ పరిశ్రమకు వాణిజ్యపరంగా బలమైన పునాది వేసేందుకు మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
2030 నాటికి గ్లోబల్ సెమికండక్టర్ చిప్ల మార్కెట్ ఒక ట్రిలియన్ డాలర్లను మించిపోనున్నదన్న అంచనాలు వెలువడుతున్న తరుణంలో మనదేశం చిప్ మార్కెట్లోకి త్వరలో ప్రవేశిస్తుందన్న ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ఇప్పుడు మనదేశం ప్రధానంగా చిప్లకు సంబం ధించి దేశీయ అవసరాలను పూర్తిచేస్తూనే, ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించే రీతిలో వ్యూహాలను రూపొందించి అమలు చేయాల్సి వుంటుంది. మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పిన విధంగా మనం కేవలం ఫ్యాబ్రికేషన్పై మాత్రమే దృష్టిపెట్టడం కాదు మొత్తం ఎకోసిస్టమ్ను పరిపూర్ణంగా నిర్మించా ల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈ రంగంలో భారత్ సంపూర్ణ దృక్కోణం ఏవిధంగా వున్నదీ అర్థమవుతోంది. అంటే తయారీతో పాటు దేశీయంగా మేధోఆస్తుల అభివృద్ధి, ఉత్పత్తి డిజైన్, ప్రామాణీకరించడం వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ప్రస్తుతం 28ా90 నానోమీటర్ సెగ్మెంట్ టెక్నాలజీపైనే మనదేశం ప్రధానంగా దృష్టిపెట్టడానికి కారణం, ప్రపంచంలో ఈ సెగ్మెంట్కున్న డిమాండ్ మాత్రమే! అతి చిన్న నానోమీటర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన కారణం కేవలం దీనికున్న ప్రాసెసింగ్ శక్తి మరియు తక్కువ విద్యుత్ను ఉపయోగించుకునే సామర్థ్యం. అదీకాకుండా 28ా90 నానోమీటర్ సెగ్మెంట్ ప్రస్తుతం పారిశ్రామిక రంగం, దాంతో మమేకమై పనిచేసే వ్యవస్థలకు అత్యంత కీలకం. ఇది భారత్లో వినియోగానికి తక్షణం అవసరం. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్కు కూడా దీని అవస రం చాలా అధికంగా వుంది. ఈ సెగ్మెంట్లో తయారీని కొనసాగించాలని నిర్ణయించడానికి మరో కారణం తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో మరింత ఆధునిక టెక్నాలజీ నోడ్స్ రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసుకోవడం.
సాంకేతిక ప్రత్యేకతలు మరియు అనువర్తనాలు
28`90 నానోమీటర్ సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఏవో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన అనేక పరిశ్రమలకు కావలసిన సంక్లిష్ట అనువర్తనాలకు ఈ నానోమీటర్ టెక్నాలజీ ఒక వేదికగా నిలుస్తుంది. ఈ నానోమీటర్ పరిమాణంలోని అతిచిన్న చిప్ల కారణంగా, తయారు చేసే సెమికండక్టర్ల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. 28ా90 నానోమీటర్ రేంజ్ పనితీరు, తక్కువఖర్చు మరియు తయారీ సంక్లిష్టతల మధ్య అద్భుతమైన సమ న్వయం సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మార్కెట్ పరంగా అత్యంత స్థితిస్థాపక లక్షణం వుంటుంది. ఫౌండ్రీ మార్కెట్ షేర్ 7.5%ను సుస్థిరంగా వుండేలా చూడగలదు. అంటే ఫ్రౌండ్రీ స్థాయిలో 15బిలియన్ యు.ఎస్. డాలర్ల మార్కెట్ అన్న మాట. ఇదే స్థితి కొనసాగితే 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల మార్కెట్ను తేలిగ్గా సాధించవచ్చు.
దేశీయ పరిశ్రమలకు ఉపయోగం
28ా90 నానోమీటర్ రేంజ్ దేశీయ పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగకరం. అంతేకాదు దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికపరంగా దేశానికి ఎంతో ప్రయోజనం చే కూరుస్తుంది. ఉదాహరణకు ఆటోమోటివ్ రంగాన్ని తీసుకుంటే ఈ చిప్లు ఇంజిన్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఉద్గమిస్తున్న విద్యుత్ వాహనాలకు అవసరమైన సాంకేతిక అవసరాలను ఈ 28ా90 నానోమీటర్ రేంజ్ తీర్చగలుగుతుంది. ఇక టెలికమ్యూనికేషన్ రంగం గురించి చె ప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ రంగానికి చిప్ సాంకేతిక పరిజ్ఞానం ఒకరకంగా ప్రాణం వంటిదనే చెప్పాలి. నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, వినియోగదారుల ఉపకరణాలు, విద్యుత్ వ్యవస్థలు ఈ చిప్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తాయి. అంతేకాదు విద్యుత్ నిర్వహణ మరియు గ్రిడ్ గరిష్టంగా పనిచేయడంలో ఇవి చాలా అవసరం. రైల్వేల్లో ఆ ధునిక సిగ్నలింగ్ వ్యవస్థల్లో ఈ చిప్స్ను విస్తృతంగా వాడతారు. అంతేకాదు రైలు నియంత్రణకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాల్లో, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో కూడా చిప్లు బాగా అవసర మవుతాయి.
దేశభద్రత మరింత పటిష్టం
28`90 ఎన్ఎం నానో టెక్నాలజీని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, హోం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లు ఈ చిప్స్ విస్తృతంగా ఉప యోగపడతాయి. ప్రస్తుతం మనదేశ ప్రాథమిక దశలో వున్న సెమికండక్టర్ పరిశ్రమ దేశంలోని బహుళ మార్కెట్ వ్యవస్థల అవసరాలను తీర్చగలుగుతుంది. కాగా మనదేశంలో సెమికండక్టర్ చిప్లు ఈ ఏడాది సెప్టెంబర్ాఆక్టోబర్ మధ్యకాలంలో మార్కెట్లోకి ప్రవేశిస్తాయని అంచనా వే స్తున్నారు. ఈ చిప్లు అందుబాటులోకి వస్తే ఆర్థికంగానే కాదు, దేశభద్రత కూడా మరింత పటిష్టమవుతుంది. ఈ నానో చిప్ల తయారీలో పరిణితి సాధించిన తర్వాత 14ా7 ఎన్ఎం చిప్ల తయారీకి ముందడుగు వేయవచ్చు.