ఆరోగ్యంపై అశ్రద్ధ వహించదు

ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్

మందమర్రి, నేటిధాత్రి:-

ప్రజలందరూ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించద్దని, ఎలాంటి జ్వర లక్షణాలు ఉన్నా ప్రభుత్వ వైద్య సిబ్బందిని కలిసి, వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. పట్టణంలోని మారుతి నగర్ లో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ క్యాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరంతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా మారుతి నగర్ లో ఇంటింటికి వెళ్లి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ గంగాధర్, ఏఎన్ఎం లు పద్మావతి, రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఆశా వర్కర్లు దేవిక, సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *