Tributes Paid to Doddi Komurayya in Bhupalpally
దొడ్డి కొమురయ్య ఆశయాలు కొనసాగించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐ.డి.ఓ.సి లో దొడ్డి కొమురయ్య జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిరాతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు. వెట్టి చాకిరీ, దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన ఆయన సాహసం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు కౌన్సిలర్ అప్పం కిషన్ యాదవ సంఘం నాయకుడు సుధాకర్ సదానందం యాదవ్ బీసీ సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.
