కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి
కేసముద్రం (మహబూబాబాద్) నేటి ధాత్రి:
కేసముద్రం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి డిజే యజమానులను కేసముద్రం తహసిల్దార్ చందా నరేష్ ముందు హాజరు పరిచారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో డీజే కు అనుమతి లేదని అన్నారు. డీజే నిర్వహించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు పలు సమస్యలు వస్తాయని అలాగే చెదురు ముదురు ఘటనలు జరిగే అవకాశం ఉందని అన్నారు తద్వారా శాంతిభద్రతలకు విగాతం కలుగుతుందని తెలిపారు.ఈ యొక్క బైండోవర్ ఉల్లంగన చేసిన వారికి చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.