మమత వర్సెస్ అభిషేక్గా సాగుతున్న రాజకీయాలు
వృద్ధులు తప్పుకోవాలని పెరుగుతున్న డిమాండ్
ఇప్పటివరకు మమత నియంత్రణలోనే పార్టీ
భవిష్యత్తు ఎట్లావుంటుందో చెప్పడం కష్టం
పార్టీపై పట్టు బిగిస్తున్న అభిషేక్ బెనర్జీ
విభేదాలు పెరిగితే పుట్టి మునగక తప్పదు
మమత తగ్గుతారా? లేక దూకుడుగా వుంటారా?
హైదరాబాద్,నేటిధాత్రి:
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2026 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫి బ్రవరి 11న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఎవ్వరితో పొత్తు పె ట్టుకునే ప్రసక్తే లేదని, తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేయడంలో పెద్దగా విశేషమేమీ లేనట్టు కనబడుతున్నా, ఇటీవల జరిగిన ఢల్లీి ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న ఆప్, జవసత్వాలు ఉడికి కాలు,చెయ్యి కదపలేని స్థితిలో వున్న కాంగ్రెస్తో కూడిన ‘ఇండీ’ కూటమితో జట్టు కడితే ఎటువంటి ప్రయోజనం వుండబోదన్న సత్యం ఆమెకు మరోసారి బోధపడినట్టు భావించాలి. తనకు రాజకీయ లబ్దిని కలిగించే ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టని దీదీ నిర్ణయం ఎవ్వరికీ పెద్దగా ఆశ్చర్యపరదనే చెప్పాలి. మితిమీరిన ఉచితాలు వికటిస్తాయన్న మరో స త్యాన్ని ఢల్లీి ఎన్నికలు రాజకీయపార్టీలకు బాగా బోధపరచి వుంటాయి. ప్రధాని పదవికి పోటీలో ఉన్నానని చెప్పుకునే మమతాబెనర్జీకి పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఎంతమాత్రం పలుకుబడిలేదన్న సత్యాన్ని గుర్తించాలి.
పెరుగుతున్న ఆధిపత్యపోరు
బయటి రాజకీయాలు ఒక ఎత్తయితే పశ్చిమబెంగాల్ అంతర్గత రాజకీయాలు ముఖ్యంగా తృణ మూల్ కాంగ్రెస్లో మమతాఅభిషేక్ బెనర్జీల మధ్య క్రమంగా పెరుగుతున్న ఆధిపత్యపోరు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. దీన్నే ‘‘ఓల్డ్ గార్డ్స్’’ వర్సెస్ ‘‘యంగ్ టర్క్స్’’ మధ్యపోటీగా అక్కడి రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని అధినేత్రిగా మమతా బెనర్జీ బయటి వారికి కనిపిస్తున్నా ఒక వయసు దాటిన వృద్ధులు రాజకీ యాలనుంచి తప్పుకొని యువకులకు ఛాన్స్ ఇవ్వాలన్న వాదనలు పార్టీలో క్రమంగా బలం పుం జుకోవడం, అభిషేక్ బెనర్జీకి పట్టం కట్టాలన్న వర్గం బలపడుతున్న సంగతిని స్పష్టం చేస్తున్నది. అయితే మమతా బెనర్జీ మాత్రం ‘‘సీనియర్ నాయకులను గౌరవించాల్సిందే’’నని స్పష్టం చేస్తున్నారు.
‘ఓల్డ్’ వర్సెస్ ‘యంగ్’
గత నెలలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ అధికార భవనం ‘నబన్న’లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రవాణా శాఖమంత్రి స్నేహశీష్ చక్రవర్తినుద్దేశించి ‘‘సరైన సంఖ్యలో బస్సులు లేకపోవడంవల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బం దులను గురించి వాకబు చేయడానికి ఏనాడైనా బస్టాండ్కు వెళ్లారా? అసలు రవాణాశాఖలో ఏంజరుగుతున్నదో ఏమీ తెలియడంలేదు’’ అని అనడంతో మంత్రి నీళ్లు నమలడమే సమాధానమైంది. ఇక విద్యాశాఖ సమీక్షలో ‘‘నాకు తెలియకుండా ప్రాథమిక పాఠశాలల్లో సెమిస్టర్ వ్యవస్థను ఎట్లా ప్రవేశపెడతారు? అటువంటి కీలకమైన నిర్ణయాలను నన్ను సంప్రదించకుండా ఎట్లా తీసుకుంటారు? దినపత్రికల్లో చదివి తెలుసుకోవాల్సి వచ్చింది’’ అని ప్రశ్నిస్తే ఆయనవద్ద కూడా స మాధానం లేదు. పిల్లల మీద భారం తగ్గించాలి కానీ, పెంచకూడదని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి స్నేహశీష్ చక్రవర్తి, విద్యామంత్రి బ్రత్యబసులు, ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి నమ్మిన బంట్లు కావడం గమనార్హం! ఈ సమీక్ష ద్వారా ఒక్క విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కొన్ని కీలక నిర్ణయాలు మమతా బెనర్జీకి తెలియకుండానే జరుగుతున్నాయి.ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలకు డైమండ్ హార్బర్ (ఇది అభి షేక్ బెనర్జీ స్థానం) కేంద్రస్థానంగా వున్నదన్నది పశ్చిమ బెంగాల్లో బహిరంగ రహస్యమే. అంతేకాదు ఈ సమీక్షపై రాష్ట్రంలోని టెలివిజన్ ఛానళ్లు తృణమూల్ పార్టీలో పెరుగుతున్న ‘‘ప్రబీణ్’’ (ప్రావీణ్యత) వర్సెస్ ‘‘నబీన్’’ (నవ్యత) మధ్య జరుగుతున్న సంఘర్షణగా పేర్కొన్నాయి. అంతేకాదు వృద్ధులు మమతా బెనర్జీవైపు, యువకులు అభిషేక్ వైపు మొగ్గు చూపుతుండటం ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామం.
కళాకారుల వివాదం
కొందరు సెలబ్రిటీ కళాకారులు, ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల్లో తాము పాల్గనాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు రద్దుచేశారని ప్రకటించారు. వీరంతా గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో యువ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం లో ముందు వరుసలో నిలవడం గమనార్హం. కొందరు తృణమూల్ కాంగ్రెస్ నాయకుల నిర్దేశం మేరకే ఈ రద్దు జరిగిందని వారు పేర్కొన్నారు. అంతకు ముందు టీఎంసీ సీనియర్ నాయకు డు, అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘అధికారపార్టీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కళాకారులను బాయ్కాట్ చేయాలి’’ అన్నది ఈ పోస్టు సారాంశం. మరుసటిరోజే అభిషేక్ బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ ‘‘ప్రజాస్వామ్యంతోనిరసనహక్కు ప్రతి ఒక్కరికి వుంటుంది. మా ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా కాదు’’ అని స్పష్టం చేశారు. అంతేకాదు అధినేత్రి మమతా బెనర్జీ తరపున ఎవ్వరూ ఎటువంటి పోస్ట్ లు పెట్టకూడదని కూడా హెచ్చరించారు. కుణాల్ ఘోష్ దీనికి స్పందిస్తూ ‘‘మమతా బెనర్జీకి తెలియకుండా, ఆమె చెప్పకుండా తానెటువంటి పోస్ట్లు పెట్టనని’’ సమాధానమిచ్చారు. ఇక్కడ కూ డా మమత, అభిషేక్ల మధ్య వున్న విభేదాలు స్పష్టమయ్యాయి.
సస్పెన్షన్లు
ఇటీవల రాజ్యసభ మాజీ సభ్యుడు శంతన్ సేన్ను టీఎంసీ సస్పెండ్ చేసింది. విచిత్రమేమంటే ఈయన అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. రాజకీయుడిగా మారిన ఈ డాక్టర్, ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనపై చేసిన ప్రకటనలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. దీనికి తోడు ‘‘సే వాశ్రయ’’ పేరుతో, అభిషేక్ లోక్సభ నియోజకవర్గం డైమండ్ హార్బర్లో అనేక మెడికల్ క్యాం పులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇదిలావుండగా గత నవంబర్ నెలలో హుమాయూన్ కబీర్ అనే పార్టీ ఎమ్మెల్యే, అభిషేక్ బెనర్జీకి హోమ్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అంతటితో ఆగకుండా మమత చుట్టూ వున్న వృద్ధ నాయకు లు నిజంగా ముఖ్యమంత్రికి, పార్టీకి శ్రేయోభిలాషులుగా వున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేయడం, పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
పార్టీలో ‘సీనియర్లు’ వర్సెస్ ‘జూనియర్లు’ మధ్య జరుగుతున్న సంఘర్షణకు సాక్ష్యంగా మరో సంఘటనను కూడా ఉదహరించవచ్చు. 2022, ఫిబ్రవరి నెలలో పార్టీ అత్యున్నతస్థానాల్లో ఉన్న నా యకులను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయించింది. విచిత్రమేమంటే ఆవిధంగా తొలగింపునకు గు రైనవారంతా అభిషేక్ మద్దతుదారులే! అయితే అభిషేక్ను కట్టడి చేయడానికే ఈ చర్య తీసుకున్నారని భావించినా తర్వాత ఆయన్ను పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించడం గమనార్హం. అంటే మమతా బెనర్జీ తన మేనల్లుడి విషయంలో ‘‘బ్రెడ్ అండ్ స్టిక్’’ పాలసీని అనుసరిస్తున్నార నుకోవాలి.
2023లో అభిషేక్ బెనర్జీ ‘‘తృణమూల్ ఎర్ నబజోవర్ యాత్ర’’ పేరుతో రాష్ట్రం లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తనపై వస్తున్న ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో ఆయన 60రోజుల పాటు ఈ యాత్రను నిర్వహించారు. ఫలితంగా తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 49స్థానాల్లో 29సీట్లు టీఎంసీ గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో గట్టిపోటీదారుగా వుంటుందనుకున్న భాజపా 12సీట్లకే పరి మితం కాగా, కాంగ్రెస్ ఒక్క సీటు దక్కించుకుంది. ఇక కమ్యూనిస్టులు ఒక్కసీటూ గెలుచుకోలేదు. మరి ఇవే ఎన్నికల్లో అభిషేక్ బెనర్జీ పార్టీ వృద్ధనాయకులైన సుదీప్ బందోపాధ్యాయ్, కళ్యాణ్ బందోపాధ్యాయ్లు పోటీచేస్తున్ననియోజకవర్గాలో ప్రచారం చేయలేదు. వీరిద్దరూ పార్టీలో యువ నాయకత్వాన్ని ఎప్పుడూ విమ ర్శిస్తుండటం గమనార్హం.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీలో రెండు అధికార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలు జోరందుకున్నాయి. గత డిసెంబర్లో మమతా బెనర్జీ తన మేనల్లుడితో సమావేశమై, పార్టీలో మార్పులు చేపట్టడానికి అనుమతివ్వడం గమనార్హం! అంతేకాదు వచ్చే ఏడాది జరుగబోయే అ సెంబ్లీ ఎన్నికల్లో పోరుకు పార్టీని సిద్ధం చేయాలని కూడా ఆమె కోరడం విశేషం! పార్టీలో వ్యక్త మవుతున్న ఆగ్రహావేశాలను, నాయకత్వం ఇప్పటివరకు సమర్థవంతంగా నియంత్రణలో వుంచ గులుతోందనేది అక్షరసత్యం. కాకపోతే పార్టీ మమతా బెనర్జీ ఛరిష్మాపైనే నడవడం పెద్ద బలహీనత! అభిషేక్ బెనర్జీకి పార్టీపై పట్టున్నప్పటికీ, ప్రజల్లో ఛరిష్మా ఎంతవరకు ఉన్నదనేది ఇంకా స్పష్టం కాలేదు! వ్యక్తి ఛరిష్మాపై ఆధారపడిన పార్టీల చరిత్ర ఎట్లా ముగిసిందో మనం చూస్తూనే వున్నాం.