తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మునిగల రాజు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ వాళ్లు అనేక బెదిరింపులు రాజకీయాలు చేశారని జిల్లాల గ్రామంలో 20 గుంటల భూమికి పరిహారం రాకుండా ఆపింది ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాలువలు పూర్తయితే నీళ్లు రావడం అందరికీ మంచిదే కానీ దానికి రాకపోవడం కారణం ఇదేనని బెదిరింపు రాజకీయాలు చేసిన వ్యక్తులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని అప్పుడు మీరు చేసిన బెదిరింపులు రాజకీయాల వల్లనే ఇప్పుడు జైలు పాలు అవుతున్నారని మీ ప్రభుత్వ హయాంలో బస్వాపూర్ గ్రామంలో రైతులు పంట నష్టపోతే పరామర్శించి పరిహారం ఇవ్వకపోవడం చేయలేదని జిల్లెల్ల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లో ఇలా నిర్మాణం పూర్తయిన సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు పంపిణీ చేయలేదని సొంత నేతల ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేసిన వ్యక్తులు మీరు కాదని త్వరలోనే అందరి వ్యవహారం బయటకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ కేకే మహేందర్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని ఇక ముందైనా కాంగ్రెస్ నాయకులపై లేనిపోని అసత్య ప్రచారాలు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ యువజన అధ్యక్షులు చుక్క శేఖర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిల భరత్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రశాంత్ అసెంబ్లీ సోషల్ మీడియా కాంగ్రెస్ కోఆర్డినేటర్ అభినయ గౌడ్ షరీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ తిరుపతి మధు వినోద్ నరేందర్ వినయ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు