మహాశివరాత్రి సందర్భంగా కోటగుళ్లను సందర్శించిన జిల్లా ఎస్పీ
రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ప్రసిద్ధ కోటగుళ్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీస్సులు పొందారు.మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు బందోబస్తు పై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు,సీఐ కరుణాకర్ రావు,ఎస్సై రేఖ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు._
