హసన్ పర్తి, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఇంటి ఇంటి సర్వే లో బాగంగా ఈ రోజు పెంబర్తి గ్రామంలో అకస్మాత్తుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు లబ్దిదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఇంటి స్థలం ఉండి ఇల్లులేకుండా ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యతగా ఇండ్లు మంజూరీ వస్తుంది, ఇంటి స్థలం లేని వారికి రెండవ దశ మంజూరి అవుతవి అని అన్నారు, హాసన్ పర్తి ఎంపిడిఓ జె ప్రవీణ్ కుమార్,ఎంపీఓ కట్ల కరుణాకర్ రెడ్డి,తహసీల్దార్ చల్ల ప్రసాద్ ,హౌజింగ్ ఇఇ రాజేందర్ ,ఇందిరమ్మ ఇండ్ల కమిటి సభ్యులు చైర్మన్ నాగవల్లి శ్రీనివాస్ (ప్రత్యేక అధికారి) కమిటి సభ్యులు జోరుక పూల,తాళ్లపెల్లి రమాదేవి- రమేష్,గోపాల్,కొయ్యడ సునీల్,సౌరం సుధాకర్,కన్వీనర్ పరకాల హేమలత (పంచాయతీ కార్యదర్శి),కారోబార్ చాతల్ల సదానందం ఇందిరమ్మ ఇండ్ల ఇంటి ఇంటి కి వెళ్ళి వారి వివరాలు ఫోన్ ఆప్ లో నమోదు చేసుకొని,సర్వే చేస్తున్నారు,గ్రామస్థులు పాల్గొన్నారు.