ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు విటమిన్ ఏ సొల్యూషన్ సిరప్ పంపిణీ

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభా విద్యాలయంలో ఏఎన్ఎం పద్మ మరియు ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు విటమిన్ ఏ సొల్యూషన్ పంపిణీ చేయడం జరిగింది. ఇది పిల్లల్లోన అందత్వం మరియు రేచీకటి రాకుండా తోడ్పడుతుందని ఏఎన్ఎం పద్మ తెలియజేశారు మరియు దీనివల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ మరియు 9 నెలల పైన ఉన్న వాళ్లకు తప్పనిసరిగా ఈ సొల్యూషన్ తాగిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ విద్యాలయం కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ మరియు ప్రతిభా విద్యాలయం స్టాఫ్ మెంబర్స్, ఆశా కార్యకర్తలు ఎస్తరా, కవిత, భాగ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *