విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు
కాటారం డిఎస్పి రామ్మోహన్ రావు
కాటారం నేటి ధాత్రి
స్వయంకృషి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను కాటారం డిఎస్పి చేతుల మీదుగా అందచేశారు. కార్యక్రమంలో స్వయంకృషి ఫౌండేషన్ సతీష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాఠశాల ప్రారంభ సమయంలో లోనే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కొందరు స్నేహితులు ద్వారా ఇస్తున్నామని, వాటిని సరిగా వినియోగించుకుని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.
డీఎస్పీ మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు అని దేశాభివృద్ధిలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుతుంది అని విద్యార్థులు అన్ని అవకాశాలను వినియోగించుకొని
ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నారు.విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన స్వయంకృషి బృందాన్ని డిఎస్పీ అబినందించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,విద్యార్థులు స్వయం కృషి సతీష్ కి వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు