కాటారం: నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు క్రీడలలో ఆసక్తిని రేపేందుకు, వారిలో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడా ప్రాంగణాలను నెలకొల్పిందని, అందులో భాగంగా క్రీడా సామాగ్రి, కెసిఆర్ కిట్లను అందజేస్తున్నట్లు కాటారం సర్పంచ్ తోట రాధమ్మ అన్నారు. మండల కేంద్రమైన కాటారం రైతు వేదికలో మండలంలోని క్రీడా ప్రాంగణాలకు క్రీడా సామాగ్రి, కెసిఆర్ కిట్లను ఆమె మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య తో కలిసి క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు తోట జనార్ధన్, మహేష్ రవీందర్రావు, బాసాని రవి, చీర్ల తిరుమల, జాడి మహేశ్వరి, హాట్గర్ రూపాదేవి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం శంకర్ నాయక్, మండల పంచాయతీ అధికారి ఆర్ ఉపేంద్రయ్య, పలు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణాలకు క్రీడా సామాగ్రి కిట్ల పంపిణీ
