గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గత నెల 15వ తారీకు గుండాల గ్రామంలో వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం గుండాల ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన సంగతి విధితమే అందులో భాగంగా కంటి పరీక్షలు చేపించుకొని డాక్టర్లు సిఫారసు చేసిన వారికి కండ్లజోళ్లను ఉచితంగా బుధవారం గుండాల గ్రామంలో వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్స్ అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడవెల్లి నరసింహారావు, వాసవి క్లబ్ సభ్యులు మానాల ప్రభాకర్, మానాల ప్రణీత్, మానాల శ్రవణ్ , గౌరిశెట్టి సత్యనారాయణ, ప్రభాకర్ , తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, ఐత శ్రీశైలం, అయితనాగమల్లయ్య, అయిత పూజిత్, తాటిపల్లి సత్యం, తాటికొండ వీరన్న, గోలి కిరణ్ ఆర్ఎంపీ వైద్యులు మహమూద్, బాస్కర్, సత్యం ,రాములు ,సతీష్, సోలం సతీష్ గ్రామస్తులు పాల్గొన్నారు.