విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ.

Seed Seed

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్ర:

ఝరాసంగం మండల పరిధిలోని గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి బర్దిపూర్ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రం – రాజేంద్రనగర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ హాజరై ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పెసర రకం MGG-295 మరియు కంది WRGE-96 రకాల యొక్క లక్షణాలు మరియు పంట సాగు మెలకువలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు.ఈ విత్తనంతో అభ్యుదయ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సాగుచేసి వచ్చే దిగుబడిని తిరిగి ఆయా గ్రామాలలోని రైతాంగానికి విత్తన రూపంలో సరఫరా చేయాలని రైతులను కోరారు.

Seed
ఈ కార్యక్రమం కింద ఝరాసంగం మండలానికి MGG-295 అనే పెసర రకం 80 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) అలాగే WRGE -97అనే కంది రకం మన మండలానికి 50 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) కేటాయించడం జరిగింది అని తెలిపారు. పంట పూర్తి కాలంలో వివిధ దశల్లో క్షేత్ర సందర్శన నిర్వహిస్తామని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఝరాసంగం చైర్మన్ గౌస్ ఉద్దీన్ మాజీ ఎంపీటీసీ శంకర్ పటేల్, మల్లన్న పటేల్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, హరికృష్ణ, ఙ్ఞానం, రేణుక వేదవతి, భారతి మరియు రైతులు మల్ల రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!